తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు-2022 టైమ్ టేబుల్ ను ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్జామినేషన్స్ తెలంగాణ) శుక్రవారం నాడు విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 10 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరగనున్నాయి.
ముందుగా పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ఫలితాలు జూన్ 30న విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్షలకు 5,03,579 మంది విద్యార్థులు హాజరు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణత సాధించడంతో, 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ నేపథ్యంలో పదో తరగతిలో ఫెయిల్ అయిన మరియు ఇంప్రూవ్ మెంట్ రాయాలనుకునే విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా టైమ్ టేబుల్ విడుదల చేశారు.
తెలంగాణలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు-2022 టైమ్ టేబుల్:
- ఆగస్టు 1 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్1 (కాంపోజిట్ కోర్స్), ఫస్ట్ లాంగ్వేజ్
పేపర్-2 (కాంపోజిట్ కోర్స్) - ఆగస్టు 2 – సెకండ్ లాంగ్వేజ్
- ఆగస్టు 3 – థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
- ఆగస్టు 4 – మ్యాథ్స్ పేపర్
- ఆగస్టు 5 – జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్ సైన్స్ అండ్ బయాలాజికల్ సైన్స్)
- ఆగస్టు 6 – సోషల్ స్టడీస్
- ఆగస్టు 8 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం మరియు అరబిక్)
- ఆగస్టు 10 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం మరియు అరబిక్).
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY