మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని నాగోల్ బండ్లగూడ, పోచారం ప్రాంతాలలో ఉన్న రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం ఉదయం సందర్శించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వగృహ ఫ్లాట్లలో ఉంటున్న నివాసితులతో ఆయన స్వయంగా మాట్లాడారు. బండ్లగూడ, పోచారం స్వగృహ ఫ్లాట్ల సముదాయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్, ఎస్.టి.పి, క్లబ్ నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పెండింగ్ సమస్యలపై వెంటనే పనులు ప్రారంబిస్తామని, రాజీవ్ స్వగృహ అపార్టుమెంట్ లలో పూర్తి సౌకర్యాలు కల్పించడానికి తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్ అన్నారు.
అపార్టుమెంట్ సముదాయాలలో ఉన్న అన్ని స్వగృహ బ్లాక్ లను సీఎస్ స్వయంగా తిరిగి పరిశీలించారు. రాష్ట్రంలో ఎంప్లాయి ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉన్నందున, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫ్లాట్ల కేటాయింపులో తగు ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. అన్నివర్గాల ఫ్లాట్ల కేటాయింపులో వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అర్వింద్ కుమార్, సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ హరీష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ