తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు హైదరాబాద్లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలోకి(సెల్ఫ్ హోమ్ క్వారంటైన్) వెళ్లినట్టుగా తెలుస్తుంది. ముందుగా సిద్దిపేటలోని ఆయన నివాసంలో ఉండే వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్రావు సహా ఆయన వెంట ఉండే 51 మంది సిబ్బంది నమూనాలు కూడా సేకరించి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. కాగా జూన్ 12, శుక్రవారం వచ్చిన ఫలితాల్లో మంత్రి హరీశ్రావుతో 17 మందికి నెగెటివ్ వచ్చినట్టుగా సమాచారం. మిగిలిన వారి ఫలితాలు రావాల్సి ఉండగా, ఈ నేపథ్యంలోనే నిబంధనలు అనుసరించి మంత్రి హరీశ్రావు స్వీయ గృహనిర్బంధం పాటిస్తునట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu