తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 17, మంగళవారం నాడు రైతు రుణమాఫీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న పంటరుణాలకు రుణమాఫీ వర్తిస్తుందని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది.
రైతు రుణమాఫీ మార్గదర్శకాలు:
- ఒక్కో కుటుంబానికి రూ.లక్ష వరకు రుణాల మాఫీ
- రూ.25వేల లోపు ఉన్న రుణాలు ఒకే దఫాలో మాఫీ
- రూ.లక్ష వరకు ఉంటే నాలుగు విడతల్లో మాఫీ
- 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు తేదీల మధ్య తీసుకున్న పంట రుణాలు, రీషెడ్యూల్ చేసుకున్న వారికీ
రుణమాఫీకి వర్తింపు - పట్టణ, నగర ప్రాంతాల్లోని బ్యాంకుల నుంచి పంటల కోసం తీసుకున్న బంగారంపై తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించదు
- రుణమాఫీ మొత్తాన్ని రైతులకు చెక్కుల ద్వారా అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం
- రైతు రుణమాఫీ అమలు కోసం ప్రత్యేక వెబ్పోర్టల్ను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
- అన్ని గ్రామాలలో లబ్ధిదారుల జాబితా రూపొందించిన అనంతరం మండల స్థాయిలో బ్యాంకర్లతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి తుది జాబితా ఖరారు.