ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నేషనల్ హెడ్ క్వార్టర్స్ న్యూడిల్లీ వారు అందించిన నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాజ్ భవన్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ, ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరు రక్త దానం చేసి, ప్రాణ దాతలు కావాలని పిలుపునిచ్చారు. ఈ మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లు బ్లడ్ డోనర్ వద్దకే వెళ్ళి రక్తాన్ని సేకరించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, ఈ సౌకర్యం వల్ల బ్లడ్ డోనర్స్ కూడా ముందుకు వస్తారని అన్నారు. ఈ నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను హనుమకొండ, హైదరాబాద్, కరీంనగర్ మరియు నిజామాబాద్ రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్ క్రాస్ ఛైర్మన్ అజయ్ మిశ్రా, గవర్నరు కార్యదర్శి కె.సురేంద్ర మోహన్ మరియు ఇతర రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY