తెలంగాణ ఫుడ్స్ కు, తెలంగాణ అధికార భాషా సంఘంకు చైర్మన్లను, తెలంగాణ ఉర్దూ అకాడమీకి అధ్యక్షుడును నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఛైర్మన్లు, అధ్యక్షుడు నియామకంపై గురువారం నాడు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ గా (మహిళా, శిశు, వికలాంగ, సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్) మేడె రాజీవ్ సాగర్ ను, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్ గా (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్) మంత్రి శ్రీదేవిని, తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా (మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్) మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ లను సీఎం కేసీఆర్ నియమించారు. మేడె రాజీవ్ సాగర్, మంత్రి శ్రీదేవి చైర్మన్ పదవుల్లో రెండు సంవత్సరాల పాటు, మహమ్మద్ ఖాజా ముజీబుద్దీన్ అధ్యక్షుడి పదవీలో మూడు సంవత్సరాల పాటుగా కొనసాగనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY