తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానాల్లో ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. కాగా సాయంత్రం 4 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో పూర్తీ స్థాయి పోలింగ్ శాతం ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పక్రియను మార్చి 17న చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానంలో 71మంది మంది అభ్యర్థులు బరిలో నిలవగా, టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, తెలంగాణ జన సమితి నుంచి ఫ్రొఫెసర్ కోదండరాం, ఇండిపెండెంట్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో 93 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, టీఆర్ఎస్ నుంచి సురభి వాణిదేవి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, టీడీపీ నుంచి ఎల్.రమణ, ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ తో పాటుగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి ప్రజల్లో నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ