తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ల్యాబోరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఆలాగే కోవిడ్ చికిత్స, పరీక్షలకు అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలను ఈ రోజు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కరోనా వ్యాప్తి, పరిస్థితులపై సీఎం కేసీఆర్ నిత్యం సమీక్ష నిర్వహించి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఐసిఎంఆర్ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నామని, ఇటీవలే రాష్ట్రంలో కరోనా సాముహిక వ్యాప్తి లేదని ఐసిఎంఆర్ తేల్చి చెప్పిందని మంత్రి ఈటల తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్స, పరీక్షలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు:
- కరోనా నిర్ధారణ పరీక్ష ధర – రూ.2,200
- ఐసొలేషన్ వార్డులో అడ్మిషన్: రూ.4,000 (రోజుకు)
- ఐసీయూలో ఉంచి వెంటిలేటర్పై చికిత్స అందిస్తే – రూ.7,500 (రోజుకు)
- ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే – రూ.9,000 (రోజుకు)
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu