ఏపీలో కొత్తగా 304 మందికి కరోనా నిర్ధారణ, 86 కి చేరిన మృతులు

AP Covid-19 Updates, andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 304 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 246 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 52, విదేశాల నుంచి వచ్చిన వారు ఆరుగురు ఉన్నారు. కొత్తగా నమోదైన 246 కేసులతో కలిపి జూన్ 15, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5087 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో గత 24 గంటల్లో(9AM-9AM) జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 15173 సాంపిల్స్ ని పరీక్షించగా 246 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. అలాగే కోవిడ్ వలన కొత్తగా కర్నూల్ లో ఒకరు, అనంతపూర్ జిల్లాలో ఒకరు మరణించగా, ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 86 కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2770 మంది కోలుకుని డిశ్చార్జి అవ్వగా, గత 24 గంటల్లో 47 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారని తెలిపారు. ప్రస్తుతం 2231 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 1159 మందికి కరోనా నిర్ధారణ అవ్వగా ప్రస్తుతం 567 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటికి 210 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా 187 మంది చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ 1369 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 6456 కి చేరింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =