దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఈ ఒక్కరోజే కొత్తగా 786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నై నగరంలోనే ఈ రోజు 569 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14,753 కి చేరింది. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ క్లస్టర్ లింకుల వలన తమిళనాడులో పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో నమోదైన 4 కరోనా మరణాలతో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 99 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 846 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7128 కి చేరింది. ప్రస్తుతం 7,526 మంది వివిధ ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu