తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రమంతటా ఒకేసారిగా పరీక్షలు నిర్వహించాలని భావించడంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా జూన్ 8 వ తేదీ నుంచి జూలై 5 వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. తాజాగా మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోగా పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్ తో చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu