ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 35,741 కరోనా పరీక్షలు నిర్వహించగా 5086 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 835, కర్నూల్ లో 626, గుంటూరులో 611, శ్రీకాకుళంలో 568, తూర్పుగోదావరిలో 450 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9,42,135 కు చేరుకుంది.
ఇక కరోనా వలన చిత్తూరులో ఐదుగురు, కర్నూలులో ఇద్దరు, అనంతపూర్ లో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కడప మరియు కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7353 కి పెరిగింది. గత 24 గంటల్లో 1745 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 9,03,072 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ