నేడు ప్రపంచ అటవీ దినోత్సవ సందర్భంగా.. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ పీ నవీన్ రావులు హాజరయ్యారు. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. కేబీఆర్ పార్క్ లో చీఫ్ జస్టిస్ మర్రి మొక్కను, జస్టిస్ నవీన్ రావు నేరేడు మొక్కను నాటగా, ఎంపీ సంతోష్ కుమార్ వేప మొక్కను నాటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు బావున్నాయని చీఫ్ జస్టిస్ ప్రశంసించారు.
Privileged to plant saplings along with Hon’ble Chief Justice #SatishChandraSharma garu & Justice #NaveenRao garu on the occasion of #WorldForestsDay.
Thank you CJ garu for your kind words towards Hon’ble CM sir’s brainchild #HarithaHaaram & #GreenIndiaChallenge🌱. @dobriyalrm pic.twitter.com/eGyDnLGxdD— Santosh Kumar J (@MPsantoshtrs) March 21, 2022
తెలంగాణ ప్రభుత్వం హరితహారం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్, చీఫ్ జస్టిస్కు తెలియజేశారు. అలాగే ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ప్రపంచ అటవీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ ను ఎదుర్కోవడానికి చెట్లను పెంచడమే ఏకైక మార్గం అని ఆయన తెలిపారు. ఈ విశేషాలను సంతోష్ కుమార్ తన ట్విట్టర్ లో పంచుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ