రాష్ట్రంలో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం ఉదయం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలు, సంబంధిత సమావేశాలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఓ వైపు ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కోసం ప్రజలు గుంపులు, గుంపులుగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు చేపట్టాలని కోర్టు సూచించింది. ఇందుకు సంబంధించిన ఆంక్షలపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు విధించిన తరహా ఆంక్షలు, నిబంధనలను పరిశీలించాని కోర్టు పేర్కొంది. మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారికీ ఎయిర్ పోర్ట్ లో పరీక్షలు నిర్వహిస్తున్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ