డీజీపీ ఎం.మహేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ శుక్రవారం నాడు సన్మానించారు. హైదరాబాద్ లోని లకిడికాపూల్ లో హోం మంత్రి కార్యాలయంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చార్మినార్ జ్ఞాపికను హోం మంత్రి డీజీపీకి బహూకరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టారని ప్రశంసించారు. విధి నిర్వహణలో తనదైన ముద్ర వేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా, రాష్ట్ర డీజీపీగానూ, దాదాపు 34 సంవత్సరాల పాటు పోలీసు అధికారిగా వివిధ హోదాల్లో పనిచేసి అందరి మన్ననలు పొందారని హోం మంత్రి ప్రశంసించారు.
ఐదు సంవత్సరాలకుపైగా డీజీపీగా పనిచేసి మహేందర్ రెడ్డి తెలంగాణ పోలీసు శాఖను అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి నేడు (డిసెంబర్ 31, శనివారం) పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE