తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకున్నారు. 2020 సంవత్సరానికి గానూ దేశంలోనే ”బెస్ట్ పర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్”గా కేటీఆర్ ను ఎంపిక చేసినట్లు స్కోచ్ గ్రూపు వెల్లడించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కు స్కోచ్ గ్రూప్ ప్రశంసాపత్రం అందజేసింది. అలాగే 2020 సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్రాన్ని “ఈ-గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్” గా స్కోచ్ గ్రూప్ ఎంపిక చేసి అవార్డు ప్రకటించింది.
ఈ సందర్భంగా స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ మంత్రి కేటీఆర్ కి, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. “ప్రజా సేవలను మెరుగుపరచడానికి తెలంగాణ రాష్ట్రం అత్యాధునిక ఐటి కార్యక్రమాలను అమలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా కోవిడ్-19 సమయంలో ఈ ఆధునిక సాంకేతికతలు పౌరులకు సేవలను అందించడానికి జీవనాధారంగా మారాయి. మంత్రి కేటీఆర్ అంతకుముందు కూడా 2016 లో స్కోచ్ ర్యాంకింగ్స్లో ‘బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్’ గా ఎంపికయ్యారు. ఇప్పటివరకు రెండుసార్లు స్కోచ్ అవార్డును దక్కించుకున్న ఏకైక రాష్ట్ర మంత్రిగా కేటీఆర్ నిలిచారు” అని స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ పేర్కొన్నారు.
Delighted to share that Telangana IT Minister @KTRTRS has been awarded the SKOCH “Best Performing IT Minister” Award for the year 2020.
Also, Telangana state has been awarded “e-Governance State of the Year” award by @skochgroup. pic.twitter.com/orV0dWO1AW
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 25, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ