తెలంగాణ రాష్ట్రంలో మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లతో పాటుగా సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలలో పోలింగ్ జరుగుతుంది. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ)లోని లింగోజిగూడ వార్డు సహా పలు మున్సిపాలిటీల్లో ఖాళీ అయిన వార్డులకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. కరోనా నేపథ్యంలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజేర్స్ అందుబాటు, భౌతిక దూరం పాటించడం, పీపీఈ కిట్స్ తో అన్ని కరోనా నిబంధనలు పాటించేలా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు.
కరోనా నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) సి.పార్థసారథి ఎన్నికల సిబ్బందికి కీలక ఆదేశాలు ఆదేశించారు. అలాగే ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే దిశగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ లో రాష్ట్రవ్యాప్తంగా 11,34,032 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను మే 3 వతేదీన నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు.
మినీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వివరాలు:
- ఎన్నికలు జరిగే మునిసిపాలిటీలు: 5
- ఎన్నికలు జరిగే కార్పోరేషన్లు: 2
- పోలింగ్ కేంద్రాలు: 1539
- ఎన్నికల సిబ్బంది: 9,809
- బరిలో ఉన్న అభ్యర్థులు: 1,307
- ఓటు హక్కు వినియోగించుకోనున్న ప్రజలు: 11,34,032
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ