తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా దయచేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి” అని ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా రేవంత్ రెడ్డి గతంలో కూడా ఓసారి కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
I have tested positive for covid with mild symptoms. Those who came in contact with me over the last few days, kindly take necessary precautions. #Covid_19
— Revanth Reddy (@revanth_anumula) January 3, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ