తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష(పాలిసెట్)-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంజనీరింగ్/నాన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీలో డిప్లొమా కోర్సులు మరియు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ ప్రవేశపరీక్ష ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కమిషనర్ నవీన్ మిట్టల్ నేడు (జూలై 12, బుధవారం) విడుదల చేశారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, పాలిసెట్-2022 కోసం రికార్డ్ స్థాయిలో 1,13,979 మంది దరఖాస్తు చేసుకోగా, జూన్ 30న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 1,04,362 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు.
వీరిలో ఎంపీసీ స్ట్రీమ్ లో 75.73 శాతం అనగా 79,038 అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారని, ఇందులో 40669 బాలురు, 38369 బాలికలు ఉన్నారన్నారు. అలాగే బైపీసీ స్ట్రీమ్ లో 75.81 శాతం అనగా 79,117 అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించగా, ఇందులో 40097 బాలురు, 39020 బాలికలు ఉన్నారని తెలిపారు. మరోవైపు పరీక్షకు హాజరైన విద్యార్థులంతా https://polycetts.nic.in వెబ్సైట్లలో ఫలితాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY