కల్నల్ సంతోష్బాబుకు కేంద్ర ప్రభుత్వం “మహా వీరచక్ర” పురస్కారం ప్రకటించింది. సైనిక బలగాలకు ఇచ్చే అత్యంత ప్రతిష్ఠాత్మక వార్టైం గ్యాలంట్రీ అవార్డుల్లో మహా వీర చక్ర రెండో అత్యున్నత పురస్కారం. గత సంవత్సరం జూన్ లో భారత్-చైనా సరిహద్దుల్లో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య తలెత్తిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు వీర మరణం పొందారు. 16 బిహార్ రెజిమెంట్కు కమాండింగ్ అధికారిగా ఉన్న సంతోష్ బాబు చైనా జవాన్ల దురాక్రమణను విజయవంతంగా తిప్పికొట్టారు. ఈ ఘటనలో సంతోష్బాబుతో పాటుగా 21 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. దేశం కోసం సంతోష్బాబు చేసిన సేవలను స్మరిస్తూ కేంద్రప్రభుత్వం ఆయనకు మహావీరచక్ర పురస్కారం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ