ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (జులై 15, శుక్రవారం) మధ్యాహ్నం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు సంబంధిత ఏర్పాట్లు చేపడుతున్నారు. గోదావరి వరదలపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, తీసుకోవాల్సిన సహాయక చర్యలపై సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మహారాష్ట్రలో భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నదికి వరదలు కొనసాగనున్నాయని, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
మరోవైపు గోదావరి వరద పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రేపు విశాఖలో వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొని, తాడేపల్లికి చేరుకున్న అనంతరం మధ్యాహ్నం నుంచి సీఎం వైఎస్ జగన్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY