తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కోత్తగా 3,980 పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 24, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీమొత్తం కేసుల సంఖ్య 7,38,795 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన మరో ముగ్గురు మరణించడంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,075 కి పెరిగింది. కరోనా రికవరీ రేటు 94.89 శాతంకాగా, మరణాల రేటు 0.55 శాతంగా నమోదైంది.
ఇక గత 24 గంటల్లో 2,398 మంది కరోనా నుంచి కోలుకోగా, రికవరీ అయినవారి సంఖ్య 7,01,047 కు చేరుకుంది. ప్రస్తుతం 33,673 మంది ఐసోలేషన్ లో లేదా చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపారు. సోమవారం నాడు 97,113 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 3,14,75,932 కు చేరగా, రాష్ట్రంలో ప్రతి పదిలక్షల జనాభాకు 8,45,673 పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. మరోవైపు ఇంకా 7,852 శాంపిల్స్ యొక్క ఫలితాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF