తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 565 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 1, మంగళవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,70,883 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ వైరస్ వలన మరణించిన వారి సంఖ్య 1462 కి పెరిగింది.
మరోవైపు కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 2,60,155 మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ కాగా, గత 24 గంటల్లోనే 925 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 9,266 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే కరోనా పరీక్షలు సంఖ్య 55 లక్షలు దాటింది. మంగళవారం నాడు 51,562 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించడంతో మొత్తం పరీక్షల సంఖ్య 55,51,620 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 1,49,156 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ