తెలంగాణ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తన స్వగృహంలో డీఎస్కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం శ్రీనివాస్కు చికిత్స కొనసాగుతుండగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విషయాన్ని డీఎస్ కుమారుడు, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇక తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం బారిన పడటంతో ఎంపీ అరవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంటున్నట్లు ప్రజలకు, కార్యకర్తలకు తెలియజేశారు. కాగా ప్రస్తుతం డి శ్రీనివాస్కు చికిత్స అందిస్తున్నామని, కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియజేస్తామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను. pic.twitter.com/Z043QOGu9f
— Arvind Dharmapuri (@Arvindharmapuri) February 27, 2023
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE