తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో కూడా మార్పు చోటు చేసుకుంది. ముందుగా పదో తరగతి-2022 పరీక్షలను మే 11 నుంచి మే 20 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేశారు. కాగా తాజాగా మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఎస్ఎస్సీ బోర్డు (డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్జామినేషన్స్ తెలంగాణ) బుధవారం నాడు సవరించిన షెడ్యూల్ ను విడుదల చేసింది. అలాగే పదో తరగతి పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్:
- మే 23 – ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్1 (కాంపోజిట్ కోర్స్), ఫస్ట్ లాంగ్వేజ్
- పేపర్-2 (కాంపోజిట్ కోర్స్)
- మే 24 – సెకండ్ లాంగ్వేజ్
- మే 25 – థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
- మే 26 – మ్యాథ్స్ పేపర్
- మే 27 – జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్ సైన్స్ అండ్ బయాలాజికల్ సైన్స్)
- మే 28 – సోషల్ స్టడీస్
- మే 30 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం మరియు అరబిక్)
- మే 31 – ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం మరియు అరబిక్)
- జూన్ 1 – ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ