కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రేపు తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా రెండు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. అలాగే మరో 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయనున్నారు గడ్కరీ. నితిన్ గడ్కరీతో పాటు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రూ.7,853 కోట్ల వ్యయంతో 354 కి.మీ. జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో స్థానిక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్లోని శంషాబాద్ వద్ద గల జీఎంఆర్ గార్డెన్స్ లో బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం.. కేంద్రమంత్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. కానీ ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ