తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే టీజీసెట్-2021 (తెలంగాణ గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ను జూలై 18న నిర్వహించనున్నట్టు టీజీసెట్ కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. “2021-2022 విద్యా సంవత్సరానికి గానూ సోషల్, ట్రైబల్, బీసీ మరియు జనరల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం వి టీజీసెట్-2021 ప్రవేశ పరీక్ష జూలై 18న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో జరుగుతుంది. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి వారం రోజుల ముందు అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మరియు పరీక్షకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలను www.tswreis.in, http:/tgcet.cgg.gov.in, http:/mjptbcwreis.telangana.gov.in, http:/tgtwgurukulam.telangana.gov.in, http:/tresidential.gov.in వంటి వెబ్సైట్లను సందర్శించి తెలుసుకోవచ్చు” అని అని టీజీసెట్ చీఫ్ కన్వీనర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ