తెలంగాణలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ , 75% పైగా నమోదు

Mango News Telugu, Municipal Elections In Telangana, Political Updates 2020, Telangana Breaking News, Telangana Municipal Elections, Telangana Municipal Elections 2020, Telangana Municipal Elections Polling, Telangana Municipal Elections Polling Completed, Telangana Political Live Updates, Telangana Political Updates

తెలంగాణ రాష్ట్రంలో నేడు జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు అందిన సమాచారం మేరకు 75 శాతం పైగా పోలింగ్ నమోదయినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిస్థాయి పోలింగ్ శాతం సమాచారం తెలియాల్సి ఉంది. 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్‌ జరగగా అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు, వాగ్వాదాలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 9 కార్పోరేషన్లకు చెందిన 324 డివిజన్లలో, 120 మునిసిపాలిటీలకు చెందిన 2647 వార్డుల్లో పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో 11,099 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం ఏడుగంటల నుంచే అన్ని చోట్లా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా తరలి వచ్చారు.

కొన్ని పోలింగ్ బూత్ ల వద్ద టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మజ్లీస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ముందుగా ఒంటి గంట వరకు 56 శాతం పోలింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 3 గంటలకు 67.46 శాతం పోలింగ్ నమోదయింది. ఇప్పటికే 80 మునిసిపల్ వార్డులు, ఒక కార్పోరేషన్ డివిజన్ ఏకగ్రీవం అయినట్టు అధికారులు ప్రకటించగా, ఈ రోజు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 25న చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్ జరగనుండగా, అక్కడ ఓట్ల లెక్కింపు పక్రియను జనవరి 27న చేపడతారు.

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − three =