టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ని గృహ నిర్బంధం చేశారు తెలంగాణ పోలీసులు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని రేవంత్ ఇంటి చుట్టూ పోలీసులను మోహరించారు. ముఖ్యమంత్రి కెసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెళ్లి లో ఈరోజు రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తానని రేవంత్ నిన్న మీడియా సమక్షంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి తన సొంత పొలంలో సుమారు 150 ఎకరాలలో వరి పండిస్తున్నారని.. కానీ, రాష్ట్రంలో మిగిలిన రైతాంగాన్ని మాత్రం వరి పంట పండించ వద్దని చెప్తున్నారని రేవంత్ నిన్న విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా వారి సమక్షంలో కెసీఆర్ ఫామ్ హౌస్ వద్ద సాగు చేస్తున్న వరిపంటను చూపిస్తానని ఆయన నిన్న ప్రకటించారు.
అయితే, ఈ అంశంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ రోజు ఉదయమే ఆయన ఇంటి చుట్టు మోహరించారు. రేవంత్ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసారు. రేవంత్ ని మిగిలిన కాంగ్రెస్ నాయకులు ఎవరూ కలవకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నాయకులూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ