తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కొత్తగా దేశమంతా తిరుగుతూ గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారని అన్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రజానీకం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే అవేమీ పట్టకుండా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడుతున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి పోరాటం చేస్తానని ఒకవైపు అంటున్నారని.. ఇంకోవైపు బీజేపీ నాయకులతో సమావేశమవుతున్నారని విమర్శించారు.
దేశంలో ఎప్పటికైనా బీజేపీని ఎదిరించి నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనని రేవంత్ తెలిపారు. దేశంలో కాంగ్రెస్ తిరిగి బలం పుంజుకుంటోందని.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణతో సహా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వ్యూహకర్తలు అవసరం లేదని.. దేశవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలే పార్టీని ప్రజలకు దగ్గర చేస్తారని నమ్ముతున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ