తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ నడుస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో మునుగోడులో పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకన్నారు. రేపు (శనివారం) ఆయన మునుగోడు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మునుగోడు నియోజకవర్గంలో ‘కాంగ్రెస్ జెండా కార్యక్రమాలు’ నిర్వహించనున్నారు. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ ర్యాలీలు, పార్టీ జెండా ఆవిష్కరణలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఒకే రోజు ఐదు మండలాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు. అలాగే నియోజకవర్గంలోని మొత్తం 175 గ్రామాల్లో ‘మన మునుగోడు- మన కాంగ్రెస్’ పేరుతో కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టనుండగా, ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా 175 మంది కాంగ్రెస్ దిగ్గజాలు నియోజకవర్గానికి రానున్నారు. ఇక ఇదే క్రమంలో ఈ నెల 21 నుంచి మండలాల వారీగా రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY