దేశంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. హిమాచల్ ప్రదేశ్ లో 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ నవంబర్ 12న ఒకే దశలో ఎన్నికలు జరగగా, గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ డిసెంబర్ 1న 89 స్థానాలకు, ఈరోజు (డిసెంబర్ 5న) 99 స్థానాలకు చివరిదైన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ రోజు సాయంత్రం 6.30 గంటల తర్వాత వెలువడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సొంతరాష్ట్రమైన గుజరాత్ లో మళ్ళీ బీజేపీ పార్టీయే అధికారం దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. గుజరాత్ లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని, అధికారాన్ని నిలుపుకోనున్నట్టు పేర్కొన్నాయి.
అయితే హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని సంస్థలు బీజేపీ వైపు మొగ్గు చూపగా, మరి కొన్ని కాంగ్రెస్ హోరాహోరీ పోటీ ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం కానున్నట్టు విశ్లేషించాయి. కాగా డిసెంబర్ 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో మాత్రం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకొనున్నట్టు తెలిపాయి. మరోవైపు డిసెంబర్ 8, గురువారం నాడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
గుజరాత్ (182):
- న్యూస్ ఎక్స్-జన్కీ బాత్ : బీజేపీ: 117-140, కాంగ్రెస్: 34-51, ఆప్: 6-13, ఇతరులు:1-2
- టీవీ9 గుజరాతీ: బీజేపీ: 125-130, కాంగ్రెస్: 40-50, ఆప్: 3-5, ఇతరులు: 3-7
- రిపబ్లిక్ టీవీ పీ-మార్క్: బీజేపీ: 128-148, కాంగ్రెస్: 30-42, ఆప్: 2-10, ఇతరులు: 0-3.
హిమాచల్ ప్రదేశ్ (68):
- న్యూస్ ఎక్స్-జన్కీ బాత్: బీజేపీ: 32-40, కాంగ్రెస్: 27-34, ఆప్: 0, ఇతరులు:1-2
- రిపబ్లిక్ టీవీ పీ-మార్క్: బీజేపీ: 34-39, కాంగ్రెస్: 28-33, ఆప్: 0-1, ఇతరులు: 1-4
- టైమ్స్ నౌ-ఈటీజీ: బీజేపీ: 34-42, కాంగ్రెస్: 24-32, ఆప్: 0, ఇతరులు: 1-3.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE