టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం రాజస్థాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత అజ్మీర్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా వద్ద మత పెద్దలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె అజ్మీర్ దర్గా వద్ద చాదర్ను సమర్పించారు. ఈ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత కవిత ట్వీట్ చేస్తూ, “అందమైన రాజస్థాన్ రాష్ట్రాన్ని సందర్శించాను. ఈరోజు ఉదయం అజ్మీర్ షరీఫ్ దర్గా వద్ద ఆశీస్సులు తీసుకున్నాను” అని పేర్కొన్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్సీ కవిత వెంట బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సహా టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అలాగే పుష్కర్ లోని పుష్కర్ ఆలయం, నాథద్వారాలోని శ్రీనాథ్జీ ఆలయాన్ని కూడా ఎమ్మెల్సీ కవిత సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Visiting the beautiful state of Rajasthan.
Earlier today, took blessings at the Ajmer Sharif Dargah pic.twitter.com/U7PisC7ktl— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 28, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE