తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ.. తెలంగాణ రాష్ట్రానికి కాపలాదారు అని పేర్కొన్నారు పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్). నేడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ప్లీనరీ జరుగుతోంది. దీనిలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ 21 వసంతాలు పూర్తి చేసుకుని 22వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ అద్భుత ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగం లోని కొన్ని ముఖ్యాంశాలు..
- టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట అని, అలాగే తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీ కాపలాదారు అని తెలిపారు.
- 60 లక్షల మంది సభ్యులు, వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పరిరక్షణకు అహర్నిశలూ పాటుపడుతోందని వెల్లడించారు.
- టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరికో చెందినది కాదని, తెలంగాణ ప్రజలందరి ఆస్తి అని ప్రకటించారు.
- టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించిందని ప్రకటించారు.
- పొరుగున ఉన్న రాష్ట్రాల్లో అనునిత్యం కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారని, కానీ మనదగ్గర మాత్రం విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు.
- ఇవాళ దేశానికి కావాల్సింది.. రాజకీయ ఫ్రంట్లు కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా అని స్పష్టం చేశారు.
- సరైన దిశానిర్దేశం ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా భారత్ నిలుస్తుందని, ఈ మేరకు దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దే ప్రత్యామ్నాయ ఎజెండా దిశగా అడుగులు వేద్దామని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ