నెల్లూరులోని ‘ఆకాశవాణి’ ఎఫ్ఎం స్టేషన్లో నూతనంగా నిర్మించిన 100 మీటర్ల ఎత్తైన టవర్ను గురువారం ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. తెలుగుగంగ కాలనీలోని ఆకాశవాణి కేంద్రం వద్ద 10 కోట్ల రూపాయలతో ఈ టవర్ను నిర్మించారు. ప్రారంభోత్సవం అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, రేడియో ప్రసారాల్లో నెల్లూరు యాస, బాస ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్ట్ను త్వరితగతిన పూర్తి చేసేందుకు నేషనల్ బ్రాడ్కాస్టర్ చేస్తున్న కృషిని అభినందించారు. అసంఖ్యాక టీవీ ఛానెల్ల ప్రభావం మధ్య ఒక మాధ్యమంగా రేడియో తనను తాను నిరూపించుకుంది అని వెంకయ్య పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మూడు రోజుల జిల్లా పర్యటనకు వచ్చారు. రేపు అల్లూరు లోని దేవిరెడ్డి శారద స్వచ్చంద సేవా సంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటనకు ముందు జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు, ఎస్పి, సిహెచ్.విజయరావుతో కలిసి ఇప్పటి వరకు అల్లూరు మండలంలోని వెంకటాచలం రైల్వేస్టేషన్, స్వర్ణ భారత్ ట్రస్ట్, దేవిరెడ్డి శారదా ట్రస్టుతో పాటు రేడియో స్టేషన్లోని అన్ని విభాగాలను పరిశీలించారు. 2019 ఫిబ్రవరి 21న ఆకాశవాణి కేంద్రాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ