తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 100% సిలబస్తో పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయించుకుంది. ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థులు మొత్తం సిలబస్ను చదవాల్సి ఉంటుందని, 100% సిలబస్తో పరీక్షలు నిర్వహిస్తామని ఈ మేరకు ఇంటర్ బోర్డు తెలిపింది. కాగా గత రెండేళ్లలో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 30% తగ్గించి 70% సిలబస్తో పరీక్షలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యథావిధిగా 100% సిలబస్తో పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఈ ఏడాది తరగతులు ప్రారంభమైనందున, మొదటి మరియు రెండవ సంవత్సరం చదువుతున్న వారికి మొత్తం సిలబస్ కవర్ చేయబడుతుందని తెలిపింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ www.tsbie.cgg.gov.inలో వంద శాతం సిలబస్కు సంబంధించిన నమూనా ప్రశ్నా పత్రాలు అప్లోడ్ చేశామని పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY