ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శుక్రవారం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ (ఏపీ, తెలంగాణ) గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీ సందర్భంగా విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలను గారెత్ విన్ ఓవెన్ ప్రశంసించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో జరిగిన సమావేశాల్లో చర్చించిన అంశాలను సీఎం వైఎస్ జగన్ తో గారెత్ విన్ ఓవెన్ పంచుకున్నారు.
అలాగే యూకేలో అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏపీలో కూడా అమలుచేయాలనే ప్రణాళికకు అభినందనలు తెలుపుతూ, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఏపీ నుంచి ఎక్కువమంది విద్యార్ధులకు బ్రిటన్ వీసాలు ఇప్పించే విషయంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. అనంతరం బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ ను సీఎం వైఎస్ జగన్ సన్మానించి, జ్ఞాపిక అందజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY