ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అప్పుడే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభించిన రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగసభలో ముఖ్య అతిథిగా అమిత్ షా పాల్గొన్నారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- కేసీఆర్ ను గద్దె దించేందుకు ఢిల్లీ నుంచి నేను రానక్కర్లేదు, బండి సంజయ్ ఒక్కడు చాలు ఆ పని చేయటానికి
- బండి సంజయ్ చేసిన ఈ యాత్ర ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, నయా నిజాంను గద్దె దించటానికి చేసినది
- నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కేసీఆర్ అధికారంలోకి వచ్చారు, కానీ వీటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
- బీజేపీ అధికారంలోకి రాగానే నీళ్లు, నిధులు, నియామకాలు.. అన్నిటినీ అమలు చేసి చూపిస్తాం
- సచివాలయానికి రాని ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలు త్వరలోనే పూర్తిగా విశ్రాంతినిస్తారు
- రైతు రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైంది? బంగారు తెలంగాణ చేస్తామన్న నినాదం ఏమైంది?
- టీఆర్ఎస్ పార్టీ కార్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో లేదు, మజ్లిస్ పార్టీ చేతిలో ఉంది, తెలంగాణ విమోచన దినం చేసే ధైర్యం సీఎం కేసీఆర్ కు లేదు
- సాయి గణేష్ హత్యకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెబుతుంది? ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులకు ఏం సమాధానం చెబుతుంది?
- యూపీ మాదిరిగానే తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది
- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధంగా ఉంది, కేసీఆర్ మీరు సిద్ధమా?
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ