కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు (ఫిబ్రవరి 10, శుక్రవారం) రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 10.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న అమిత్ షాకు గవర్నర్, డీజీపీ, పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు స్వాగతం పలకనున్నారు. ఫిబ్రవరి 11, శనివారం ఉదయం సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరగనున్న ఐపీఎస్ ల పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్యఅతిధిగా హాజరయ్యేందుకు హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.
హైదరాబాద్ చేరుకున్న అనంతరం శుక్రవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి అమిత్ షా నేరుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి చేరుకోనున్నారు. ఇక శనివారం ఉదయం 7.50 గంటల నుంచి 10.30 గంటల వరకు పోలీస్ అకాడమీలో జరిగే ఐపీఎస్ ప్రొబేషనర్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొని ప్రసంగించనున్నారు. పరేడ్ ముగిశాక 11 గంటల నుంచి 12 గంటల వరకు పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. గంట భోజన విరామం అనంతరం అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుని, తిరిగి ఢిల్లీకి పయనంకానున్నారు. ఈసారి అమిత్ షా హైదరాబాద్ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమంగానే కొనసాగనుంది. కాగా 74వ బ్యాచ్ లో 195 మంది ఐపీఎస్ లు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇందులో 166 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు, 29 మంది విదేశీ ఆఫీసర్లు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE