తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అయిన గీతా రెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహమ్మద్ అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్ లకు రాష్ట్రంలోని పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. అలాగే కాంగ్రెస్ సంస్థలు, విభాగాలు, సెల్స్ బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ మేరకు మంగళవారం నాడు రేవంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కు బాధ్యతలు:
- జే.గీతారెడ్డి – పార్లమెంట్ స్థానాలు (సికింద్రాబాద్, నల్లగొండ, హైదరాబాద్), ఎన్ఎస్యూఐ, ఇంటెలెక్ట్చువల్ సెల్, రీసెర్చ్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొఫెషనల్ కాంగ్రెస్.
- ఎం.అంజన్ కుమార్ యాదవ్ – పార్లమెంట్ స్థానాలు (నిజామాబాద్, మహబూబాబాద్, మెదక్, పెద్దపల్లి), యూత్ కాంగ్రెస్, మైనారిటీ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్.
- మహమ్మద్ అజారుద్దీన్ : పార్లమెంట్ స్థానాలు (ఆదిలాబాద్, జహీరాబాద్, మల్కాజ్గిరి), సోషల్ మీడియా.
- టీ జగ్గారెడ్డి : పార్లమెంట్ స్థానాలు (ఖమ్మం, వరంగల్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్), మహిళా కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, లేబర్స్ సెల్, అన్-ఆర్గనైజ్డ్ వర్కర్స్ సెల్.
- బి.మహేశ్ గౌడ్ : పార్లమెంట్ స్థానాలు (చేవేళ్ల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్), ఆర్గనైజేషన్ కోఆర్డినేషన్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ డిపార్ట్మెంట్స్, సేవాదళ్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ