సరిగ్గా 100 రోజుల్లో పాదయాత్ర మొదలుపెడతా, వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్ షర్మిల

2023 Assembly Elections, Mango News, YS Sharmila, YS Sharmila Launch her YSR Telangana Party, YS Sharmila Launch her YSR Telangana Party Officially, YS Sharmila Launch Political Party In Telangana, YS Sharmila Launches Her Own Party In Telangana Today, YS Sharmila New Party In Telangana, YS Sharmila New Party Launch, YS Sharmila New Party Name, YS Sharmila New Party News, YS Sharmila To Launch her YSR Telangana Party Officially Tomorrow, YSR Telangana Party, YSR Telangana Party Launch, YSR Telangana Party Launch News

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్ లో కొత్త పార్టీ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ షర్మిల తన పార్టీకి “వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ” గా నామకరణం చేశారు. అలాగే వైఎస్ఆర్ టీపీ జెండాను కూడా షర్మిల ఆవిష్కరించారు. వైఎస్ఆర్ టీపీ ఆవిర్భావ కార్యక్రమానికి షర్మిల భర్త అనిల్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు.

ఈ సభలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ, తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చేందుకే షర్మిల కొత్త పార్టీని స్థాపిస్తున్నదన్నారు. తెలంగాణను వైఎస్‌ఆర్ ఎంతో అభివృద్ధిని చేశారని, వైఎస్ఆర్ తరహాలో షర్మిల తెలంగాణ ప్రజలకోసం పోరాడుతుందని, ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా నిలబడుతుందని అన్నారు. తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్‌ నిర్మాణంలో షర్మిలకు మద్ధతుగా నిలవాలని ప్రజలను, వైఎస్ఆర్ అభిమానులను, నాయకులను వైఎస్ విజయమ్మ కోరారు.

సరిగ్గా 100 రోజుల్లో పాదయాత్ర మొదలుపెడతా: 

అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ, వైఎస్‌ఆర్‌ పుట్టినరోజున పార్టీ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో మళ్ళీ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పెట్టినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజలు ఇంకా వైఎస్‌ఆర్‌ పాలనను తలచుకుంటున్నారని, పేదరికం రూపుమాపడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పనిచేస్తుందని షర్మిల పేర్కొన్నారు. సంక్షేమం, స్వయం అభివృద్ధి, సమానత్వం పార్టీ విధి విధానాలని వైఎస్ షర్మిల తెలిపారు. ఎంతో మంది ఆత్మ బలిదానాలుచేసుకుంటే తెలంగాణ వచ్చిందని, తెలంగాణ ప్రగతి పథంలో నడవాలన్నది వైఎస్ఆర్ టీపీ లక్ష్యమన్నారు. అలాగే తెలంగాణకి రావాల్సిన ఒక్క చుట్ట నీటి బొట్టు కూడా వదులుకొమని, వేరే రాష్టానికి వెళ్లాల్సిన ఒక్క చుక్కకి అడ్డుపడము అని తెలిపారు. ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో కోట్లాడతాం. సరిగ్గా 100 రోజుల్లో పాదయాత్ర మొదలుపెడతాను, ప్రజలు ఆశీర్వాదం ఇస్తే ప్రతి ఇంటికి మా పాలన అందిస్తాం, నమ్మిన దానికి చిత్త శుద్దిగా పని చేస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 4 =