వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో అక్టోబరు 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం 9:30 గంటలకు తిమ్మాపూర్ నుంచి ఆమె పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రాచలూర్ నుంచి గాజులపురుగు తండా, బేగంపేట్, మాధాపూర్ గ్రామాల మీదుగా షర్మిల పాదయాత్ర కోనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట్ సమీపంలో భోజనం విరామం అనంతరం 3 గంటల నుంచి పాదయాత్రను పునఃప్రారంభించి, మాధాపూర్, ఎలిమినేడు గ్రామాల్లో ప్రజలను కలుసుకోనున్నారు. 6 గంటల అనంతరం పాదయాత్ర ముగించి ఎలిమినేడు గ్రామంలో బస చేయనున్నారు. వైఎస్ షర్మిల ఎనిమిదో రోజు ప్రజాప్రస్థానం మహా పాదయాత్రలో ప్రముఖ యాంకర్ శ్యామల దంపతులు పాల్గొని, ఆమెకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ