వైఎస్ షర్మిల ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పాదయాత్ర, పాల్గొన్న యాంకర్ శ్యామల దంపతులు

Mango News, Praja Prasthanam Padayatra Reached to 8th Day, Praja Prasthanam Padyatra, Sharmila launch praja prasthana yatra, telangana, YS Sharmila, YS Sharmila follows in YSR’s footsteps, YS Sharmila Launches Praja Prasthanam Padyatra, YS Sharmila Launches Praja Prasthanam Padyatra Against TRS, YS Sharmila Launches Praja Prasthanam Padyatra Against TRS Rule, YS Sharmila Praja Prasthanam Padayatra, YS Sharmila Praja Prasthanam Padayatra Reached to 8th Day, YSRTP, YSRTP Chief YS Sharmila

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ పేరుతో అక్టోబరు 20వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్ర‌జా ప్ర‌స్థానం పాదయాత్ర‌ ఎనిమిదో రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం 9:30 గంటలకు తిమ్మాపూర్‌ నుంచి ఆమె పాదయాత్రను ప్రారంభించారు. అనంతరం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రాచలూర్ నుంచి గాజులపురుగు తండా, బేగంపేట్, మాధాపూర్ గ్రామాల మీదుగా షర్మిల పాదయాత్ర కోనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట్ సమీపంలో భోజనం విరామం అనంతరం 3 గంటల నుంచి పాదయాత్రను పునఃప్రారంభించి, మాధాపూర్, ఎలిమినేడు గ్రామాల్లో ప్రజలను కలుసుకోనున్నారు. 6 గంటల అనంతరం పాదయాత్ర ముగించి ఎలిమినేడు గ్రామంలో బస చేయనున్నారు. వైఎస్ షర్మిల ఎనిమిదో రోజు ప్రజాప్రస్థానం మహా పాదయాత్రలో ప్రముఖ యాంకర్ శ్యామల దంపతులు పాల్గొని, ఆమెకు మద్దతుగా పాదయాత్ర చేపట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 16 =