తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రముఖ కంపెనీ ముందుకొచ్చింది. భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(బీఎస్వీ) సంస్థ రాజధాని నగరం హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. రూ. 200 కోట్లతో టీకాల తయారీ కేంద్రాన్ని జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేయనుంది ఈ బీఎస్వీ గ్లోబల్ సంస్థ. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావన్ గుల్ ప్రకటించారు. ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నందుకు సంస్థ ఎండీ సంజీవ్ నావన్ గుల్కు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సరికొత్త టీకాల తయారీ కేంద్రం ఏర్పాటుతో హైదరాబాద్ వ్యాక్సిన్ హబ్గా నిలవనుందని మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Glad to announce that @BSV_Global decided to announce that they will set up state of the art injectable & vaccine manufacturing facility in @GenomeValley with an investment of ₹200Cr
Thanks to MD of BSV @SanjivSnavangul Ji. This will consolidate Hyd as vaccine Hub of the world pic.twitter.com/XeBO6A8QDP
— KTR (@KTRTRS) April 12, 2022
మంత్రి కేటీఆర్ ఇటీవలే తెలంగాణాలో పెట్టుబడులను ఆహ్వానించటానికి అమెరికా పర్యటన కూడా చేసిన విషయం తెలిసిందే. దేశీయంగా ఉన్న ప్రముఖ కంపెనీలతో పాటు కొత్తగా వ్యాపారం రంగంలోకి ప్రవేశించటానికి ఉత్సాహం చూపే కొత్త ఎంట్రప్రెన్యూర్స్ వరకు అందరినీ మంత్రి కేటీఆర్ తెలంగాణాలో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నారు. పెట్టుబడులకు సిద్దమైన వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, రాయితీలు ప్రకటిస్తామని వారికి హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొని కంపెనీలు హైదరాబాద్లో తమ శాఖలను విస్తరించడానికి ముందుకొస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ