జర్మనీ రవాణా కంపెనీ ఫ్లిక్స్బస్ భారతదేశంలోకి అడుగు పెడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్ అయిన ఇండియాలో ప్రయాణికుల కోసం తక్కువ ధరకే మెరుగైన ఇంటర్సిటీ ప్రయాణ అనుభవాన్ని అందించడానికి తాము సిద్ధం అవుతున్నామని వెల్లడించింది.
దీనిని మొట్టమొదటగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, యూపీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ రాష్ట్రాలలో ఉన్న ప్రధాన నగరాలు, మార్గాలను కలుపుతూ ఫ్లిక్స్బస్ సర్వీసులను నడుపుతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఫ్లిక్స్బస్సులు ఫిబ్రవరి 6 నుంచి తమ సర్వీసులను ప్రారంభించబోతున్నట్లు తెలిపింది.
ఫ్లిక్స్బస్ సర్వీసులను ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బస్ మార్కెట్లలో ఒకటైన భారత్కి విస్తరించడం తమకు చాలా సంతోషిస్తుందని కంపెనీ తెలిపింది. ఇది తమకు 43వ దేశం అన్న కంపెనీ దారులు… అందరికీ సుస్థిరమైన, సురక్షితమైన, సరసమైన ప్రయాణ ఎంపికలు అందిస్తామని చెప్పుకొచ్చారు.
తమ సంస్థ లాంచింగ్ ఆఫర్ కింద స్టార్టింగ్ రూట్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే రూ. 99 లకే టికెట్ అందించనున్నట్లు ఫ్లిక్స్బస్కంపెనీదారులు ప్రకటించింది. నార్త్ ఇండియాలోని ఢిల్లీ నుంచి అయోధ్య, ఛండీఘర్, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్పూర్, అజ్మీర్, వారణాసి, ధర్మశాల, లక్నో, జోధ్పూర్, అమృత్సర్ వంటి పర్యాటక కేంద్రాలకు, ఆధ్మాత్మిక ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడుస్తాయి. ఫ్లిక్స్బస్ టోటల్ నెట్వర్క్లో 59 స్టాప్లు, మొత్తం 200 కనెక్షన్లు ఉంటాయి.
జర్మనీకి చెందిన ఫ్లిక్స్బస్ సర్వీస్..స్పెషల్గా BS6 ఇంజిన్లతో కూడిన ప్రీమియం బస్ మోడల్లతో తమ బస్సులను నడుపుతోంది. పర్యావరణ సుస్థిరతను పెంపొందించేలా కఠినమైన ఉద్గార నిబంధనలకు కట్టుబడి ఈ బస్సులను తయారు చేశారు .
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE