రాజధాని అమరావతి రైతులు నవంబర్ 1వ తేదీనుంచి “న్యాయస్థానం టూ దేవస్థానం” పేరుతో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రను నవంబర్ 1న తుళ్ళూరు గ్రామంలో ప్రారంభించి 47 రోజులపాటుగా డిసెంబర్ 17 వరకు తిరుమలలో ముగించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పాదయాత్ర అనుమతి కోసం దరఖాస్తు చేసిన అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావుకు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖ రాశారు. రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తునట్టు తెలిపారు. ఈ మహా పాదయాత్ర వల్ల ఘర్షణలు, విద్వేషాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వివిధ గ్రామాల మీదుగా ఈ యాత్ర సాగినప్పుడు ఏర్పడే పరిణామాలు ఘర్షణలకు దారితీయవచ్చని అన్నారు. అలాగే 47 రోజుల పాటు భారీగా సాగే ఈ యాత్రకు పోలీసు భద్రత కల్పించటం కష్టమని పేర్కొన్నారు. శాంతి భద్రతలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రైతులు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ లేఖలో తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ