గత నెలలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్కు ఘనంగా నివాళి అర్పించటానికి పూనుకుంది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. బిపిన్ రావత్ పేరును మెయిన్పురి జిల్లాలోని ఒక సైనిక్ స్కూల్కు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తమిళనాడులోని నీలగిరి కొండల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రావత్కు నివాళిగా.. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారని సీఎం కార్యాలయం గురువారం ఒక ట్వీట్ చేసింది. 2019 ఏప్రిల్ ఒకటిన ఈ స్కూల్ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ స్కూల్ కి బిపిన్ రావత్ పేరును పెట్టనున్నారు. కూనూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ దంపతులుసహా 13 మంది అమరులైన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ