అమెరికా కాన్సులేట్ జనరల్ జోయెల్ రీఫ్మెన్ జనవరి 16, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్కుమార్తో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల విషయాలపై కీలకంగా చర్చించారు. అలాగే హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో నిర్మాణం కావాల్సి ఉన్న అమెరికా వీసా కార్యాలయం విషయంపై కూడా జోయెల్ రీఫ్మెన్, సీఎస్ సోమేష్కుమార్ చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. సోమేష్కుమార్ జనవరి 1, 2020న తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అలాగే జోయెల్ రీఫ్మెన్ కూడా ఇటీవలే అమెరికా కాన్సులేట్ జనరల్గా హైదరాబాద్ లో నియమితులవ్వడంతో మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తుంది.
[subscribe]
Minister KTR Open Challenge To Uttam Kumar Reddy | Telangana Municipal Elections | Mango News
07:23
KTR Says To Use Social Media For Telangana Municipal Elections | TRS Social Media Meet | Mango News
09:13
CM KCR Follows Social Media For Daily Updates Says KTR | TRS Social Media Meet | Telangana News
07:59
Talasani Srinivas Yadav Huge Appreciation For CM YS Jagan | Telugu Latest News | Mango News
03:41