ఆంధ్రప్రదేశ్ హిందూపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో వ్యవహారం తెలుగు రాష్ట్రాలలోని కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్ స్పందించింది. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. మీడియాలో వెలుగు చూసిన ఆ వీడియో వ్యవహారంపై సత్వరమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన ఘటనలో ఈ ఘటనలో నిజనిజాలు త్వరగా నిగ్గుతేల్చాలని వాసిరెడ్డి పద్మ ఆ లేఖలో పేర్కొన్నారు.
మరోవైపు దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఈ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే ఎంపీ గోరంట్లపై పార్టీపరంగా కఠిన చర్యలు తప్పవని కూడా సజ్జల రామకృష్టారెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా తాజాగా ఎంపీ గోరంట్ల మాధవ్ ఒక మహిళకు వీడియో కాల్ చేసి అనుచితంగా ప్రవర్తించిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిని ఆయన ఖండించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కానని, కావాలనే కొందరు అది మార్ఫింగ్ చేశారని ఆరోపించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY