బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అందరూ అర్థం చేసుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బీ.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. “భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ బీ.ఆర్.అంబేద్కర్ భారతీయ సమాజాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు కాబట్టే సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలను చట్ట సభల వైపు నడిపించాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయాలని సంకల్పించారు. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరాలని తపించారు. ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నా తరపున, జనసేన పక్షాన హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ తెలిపారు
“వర్తమాన సమాజం మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అర్ధం చేసుకోవాలి. రాజ్యాంగ రచన కోసం ఆయన ఎంతగా శ్రమించారో తెలుసుకోవాలి. స్త్రీ విద్య గురించి, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారికి హక్కు కల్పించడం గురించి తన అభిప్రాయాలను చర్చల్లో ఎంత బలంగా వినిపించారో నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆశయాలను అవగాహనపరచుకున్నాం కాబట్టే జనసేన పార్టీ సిద్ధాంతాలపై ఆ ప్రభావం ఉందని స్పష్టంగా చెప్పగలుగుతున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE