తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 6, సోమవారం నాటికీ 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 45 మంది ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకోగా, ప్రస్తుతం 308 మందిచికిత్స పొందుతునట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ వైరస్ వలన ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్టు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పలువురు ప్రముఖులు అభినందిస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తమ వంతు సాయంగా పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు. పలు సంస్థల ప్రతినిధులు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకుని విరాళానికి సంబంధించిన చెక్కులను అందజేస్తున్నారు.
తెలంగాణ సీఎం సహాయనిధికి సోమవారం అందిన విరాళాల వివరాలు:
- తెలంగాణ రాష్ట్రంలో ఐకెపి విఓఎలు 1,72,61,000 రూపాయలను విరాళంగా అందించారు. రాష్ట్రంలో మొత్తం 17261 మంది విఓఏలున్నారు. వారికి నెలకు మూడు వేల రూపాయల వేతనం వస్తుంది. దీంట్లోంచి వారు ఒక్కొక్కరు వేయి రూపాయలు విరాళంగా ప్రకటించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఐకెపి విఓఏల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎల్. రూప్ సింగ్, రాష్ట్ర అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్, ప్రధాన కార్యదర్శి మారిపెల్లి మాధవి, కోశాధికారి తిరుపతిలు ఈ విరాళాన్ని సీఎం కేసీఆర్ కు ప్రగతి భవన్ లో అందజేశారు.
- రాష్ట్ర మహిళా సమాఖ్యలకు చెందిన స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తరుఫున కోటి రూపాయల విరాళాన్ని అందించారు. స్త్రీనిధి అధ్యక్షురాలు ఎస్. అనిత దీనికి సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్ కు అందించారు.
- తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం అందించింది. దీనికి సంబంధించిన చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ అధ్యక్షుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి సీఎం కేసీఆర్ కు అందించారు.
- తెలంగాణ బ్రీడర్స్ అసోసియేషన్ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. సంబంధిత చెక్కును అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి జి. రంజిత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు అందించారు.
- యూనిక్ ట్రీస్ అధ్యక్షుడు శ్రీ రామ్ దేవ్ రూ.25 లక్షల విరాళాన్ని చెక్కు రూపంలో సీఎంకు అందించారు.
- తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు (టెస్కాబ్) కోటి రూపాయల విరాళం ప్రకటించింది. రూ. 88 లక్షలు బ్యాంకు విరాళం కాగా, రూ.8.5 లక్షలు బ్యాంకు ఉద్యోగులవి. రూ.3.5 లక్షల చెక్కును టెస్కాబ్ చైర్మన్ కె రవిందర్ రావు, వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు అందించారు.
- డిసిసిబిలు, సింగిల్ విండోలు కలిపి రూ.76 లక్షలు విరాళంగా ప్రకటించాయి. డిసిసిబి చైర్మన్లు ఒక్కొక్కరు రూ. లక్ష, సింగిల్ విండో చైర్మన్లు రూ.5వేలు, ఉద్యోగులు ఒక రోజు వేతనానికి సంబంధించిన చెక్కు సీఎంకు అందించారు.
- రెడ్డీస్ ల్యాబ్స్ రూ.5 కోట్ల విలువైన మందులు, ఎన్ 95 మాస్కులు అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను రెడ్డీస్ ల్యాబ్స్ చైర్మన్ సతీష్, ఎండీ జివి ప్రసాద్ సీఎం కేసీఆర్ కు అందించారు.
- ఎమ్ఎస్ఎన్ ల్యాబ్స్ రూ.5 కోట్ల రూపాయల మందులు, ఇతర మెడికల్ సామాగ్రి అందించడానికి ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన కాన్సెంట్ లెటర్ ను సంస్థ చైర్మన్ ఎమ్. సత్యనారాయణ రెడ్డి సీఎంకు అందించారు.
- ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలోని దాతలు ‘గుడ్ సమరిటాన్స్ ఆఫ్ ఖమ్మం’ పేరిటి ఏర్పడి 2 కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. ఇందులో కోటి 75 లక్షలు విరాళాలు రాగా, 25 లక్షలను మమత వైద్య విద్యా సంస్థలు అందించారు. 2 కోట్ల రూపాయల చెక్కును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు అందించారు.
- అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఎ. జలంధర్ రెడ్డి రూ.50 లక్షల రూపాయల చెక్కును, డిఇసి ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఎండీ అనిరుధ్ గుప్తా సంబంధిత చెక్కును సీఎంకు అందించారు. పిసి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ కె అనిల్ కుమార్ రూ.50 లక్షల రూపాయల చెక్కును సీఎంకు అందించారు.
- ఎస్ఎల్ఎంఐ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండీ బి. వెంకటరెడ్డి, శ్రీ వెంకటేశ్వర కన్ స్ట్రక్షన్స్ ఎండీ ఎం. రవీందర్ రెడ్డి, సీల్ వెల్ కార్పొరేషన్ ఎండీ బంగారు సుబ్బారావు తమ సంస్థల తరపున రూ.25 లక్షల రూపాయల విరాళాలను సీఎం కేసీఆర్ కు అందించారు.